శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ నంద టీమ్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ నంద టీమ్

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమల శ్రీవారిని "గౌతమ్ నంద" మూవీ టీమ్ దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో నటుడు గోపీచంద్, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సంపత్ నంది, సంగీతదర్శకుడు తమన్ స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దర్శనం చేయించారు. అనంతరం పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం పట్ల గోపీచంద్ ఆనందం వ్యక్తం చేశారు. తను నటించిన "గౌతమ్ నంద" 28వ తేదీ విడుదలయి మంచి విజయం సాధించాలని స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమపై పడిన డ్రగ్స్ ముద్ర నుంచి త్వరలోనే సినీ ఇండస్ట్రీ కోలుకుంటుందని గోపిచంద్ అన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ నంద టీమ్ Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుమల శ్రీవారిని "గౌతమ్ నంద" మూవీ టీమ్ దర్శించుకుంది. ఉదయం నైవేద్య విరామ సమయంలో నటుడు గోప...

No comments: