ఓటు హక్కుపై అవగాహన సదస్సు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఓటు హక్కుపై అవగాహన సదస్సు

రవికిరణాలు(వెంకటగిరి రిపోర్టర్ - చిన్నరావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపైన అవగాహన సదస్సు నిర్వహించారు. అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా వెంకటగిరి తహసీల్దార్ రాజ్ కుమార్ హాజరయ్యరు. విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఉపయోగపడి కష్టపడి పనిచేసే నాయకులను ఎన్నుకోవాలని తహసీల్దార్ తెలిపారు. స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని ఇప్పటికి అంటూనే ఉన్నారని, ఇంకెప్పుడు అభివృద్ధి చెందిన దేశం అంటారు అని అన్నారు. అలా జరగాలంటే విద్యార్థి దశలోనే ఓటు హక్కుపై అవగాహన చేసుకుని మంచి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటే అభివృద్ధి చెందిన దేశం అని ప్రపంచ దేశాలలో మొదటి స్థానంలో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌ఈవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ నారాయణ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఓటు హక్కుపై అవగాహన సదస్సు Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(వెంకటగిరి రిపోర్టర్ - చిన్నరావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో నారాయణ పాఠశాలలో విద్యార్థులకు ఓటు హక్కుపైన అవగాహన సదస్సు ని...

No comments: