బైక్ మిస్సింగ్...సిఐ స్టిక్కరింగ్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బైక్ మిస్సింగ్...సిఐ స్టిక్కరింగ్

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - నాగరాజు) : చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను పరిరక్షించాల్సిన పోలీసులే పోలీస్ దొంగగా మారారు. కర్నూలు జిల్లా ఆదోనిలో గత 3 నెలల క్రితం ఏపి21ఏఏ0622 గల మోటర్ స్కూటర్ ను నరేష్ అనే వ్యక్తి ఆదోని రైల్వే స్టేషన్లో వదిలి వెళ్ళారు. స్కూటర్ స్టాండులో స్కూటర్ కనబడకపోవడంతో 2వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కానీ ఆ స్టేషన్ సిఐ దర్జాగా ఆ స్కూటర్ పై పోలీస్ అని స్టిక్కర్ వేయించాడు. రోజు యోగ సెంటర్‌కి వెళ్ళడానికి, సొంత పనులకు ఉపయోగిస్తున్నారు. ఈ విషయం రవికిరణాలు TV కంటపడి విచారించగా, బాధితుడు ఫిర్యాదు చేయలేదని సమాధానం ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సిఐ పోలీస్ స్టికర్ ను తొలగించే దృశ్యం కూడా రవికిరణాలు TV కెమెరాకు చిక్కింది. సీఐగారి నిర్వాకం పైఅధికారి వద్దకు తీసుకెళ్తే.. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
బైక్ మిస్సింగ్...సిఐ స్టిక్కరింగ్ Reviewed by CHANDRA BABU on July 24, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - నాగరాజు) : చట్టాన్ని గౌరవిస్తూ ప్రజల ధన, మాన, ప్రాణాలను పరిరక్షించాల్సిన పోలీసులే పోలీస్ దొంగగా మారారు. కర్నూ...

No comments: