దేశద్రోహులుగా గుర్తించాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

దేశద్రోహులుగా గుర్తించాలి

రవికిరణాలు(హైదరాబాద్) : మాదకద్రవ్యాలను విక్రయించేవారిని దేశద్రోహులుగా పరిగణించే విధంగా ఒక చట్టాన్ని చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్‌ చేశారు. భారత దేశంలోని యువకులు, విద్యార్థులు, సినిమా రంగాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ మాఫియా చర్యలను తిప్పికొట్టాలన్నారు. ఈ డ్రగ్స్ మాఫీయాలో ఉన్నవారిని తీవ్రవాదులుగా పరిగణించి వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకొవాలన్నారు. ఈ విషయంలో సి.బి.ఐ.దర్యాప్తుకు ఆదేశాలు జారీచేయాలన్నారు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రధానమంత్రిని విజ్ఞప్తి చేశారు. దేశంలోని అన్ని సినిమా రంగాలలో ఈ డ్రగ్స్ వాడకం ఉన్నప్పటికీ కేవలం తెలుగు పరిశ్రమనే నిందించడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల మత్తులో మానవ సమాజం అనే అంశంపై సోమాజిగుడ ప్రెస్ క్లబ్ లో చర్చా వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రతికేయులు కొమ్మినేని శ్రీనివాస్ , సూర్యప్రకాష్ రావు, మాజీ పోలీస్ అధికారి గోపీనాథ్ రెడ్డి, సినిమా రంగానికి చెందిన జొన్నవితుల, త్రిపురనేని చిట్టి, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్, ఏఐఎస్‌ఎఫ్‌ తెలంగాణ అధ్యక్షుడు వేణు, పి.డి.ఎస్.యూ అధ్యక్షుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు.
దేశద్రోహులుగా గుర్తించాలి Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(హైదరాబాద్) : మాదకద్రవ్యాలను విక్రయించేవారిని దేశద్రోహులుగా పరిగణించే విధంగా ఒక చట్టాన్ని చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్ష...

No comments: