స్వచ్ఛ తిరుమలకు ఓఎన్‌జిసి రూ.13 కోట్లు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

స్వచ్ఛ తిరుమలకు ఓఎన్‌జిసి రూ.13 కోట్లు

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుపతి టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం ఉదయం ఓఎన్‌జిసి, టిటిడి అధికారులతో కలిసి ఈవో సమావేశం నిర్వహించారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా తిరుమలలో చేపడుతున్న కార్యక్రమాలకు సహకారం అందించేందుకు ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ONGC) కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా సోమవారం 6.78 కోట్ల చెక్కును టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ కు అందించారు. ఈవో మాట్లాడుతూ స్వచ్ఛ ఆదర్శనీయ ప్రాంతంగా తిరుమల ఎంపికైన నేపథ్యంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఓఎన్‌జిసి సహకారం అందించడం పై సంతోషం వ్యక్త పరిచారు. ఈ నేపథ్యంలో రూ.13 కోట్లు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఓఎన్‌జిసి మొదటి విడతలో రూ.6.78 కోట్లను అందించినట్లు తెలిపారు. తిరుమలలో మురుగునీరు శుద్ధిచేసి వినియోగం కొరకు, ఘనవ్యర్థాల నిర్వహణ, విద్యుత్‌ ఆధునీకరణ, పొదుపు చర్యలు, మెరుగైన పారిశుద్ధ్యం, రవాణా తదితర అభివృద్ధి పనులకోసం ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మరింత వేగవంతంగా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. టిటిడిలో జరుగుతున్న పనుల పరిశీలన కోసం త్వరలో  కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి శ్రీధర్మేంధ్ర ప్రధాన్‌ తిరుమలకు రానున్నారని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.

స్వచ్ఛ తిరుమలకు ఓఎన్‌జిసి రూ.13 కోట్లు Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్ - సెల్వం) : తిరుపతి టిటిడి పరిపాలనాభవనంలో సోమవారం ఉదయం ఓఎన్‌జిసి, టిటిడి అధికారులతో కలిసి ఈవో సమావేశం నిర్వహించా...

No comments: