తమిళనాడులో తెలుగు ప్రజాసంఘాల కృషి ఫలించింది - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తమిళనాడులో తెలుగు ప్రజాసంఘాల కృషి ఫలించింది

నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : తమిళనాడులో తెలుగు ప్రజాసంఘాల కృషి ఫలించిందని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల శంకరయ్య ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులో తెలుగు ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్నోమార్లు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తెలుగు ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయని గతంలో తమిళనాడు గవర్నర్ రోశయ్య ఉన్న కాలంలో అనేక మార్లు కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గవర్నర్ స్పందించి ప్రభుత్వాన్ని చేయడం జరిగిందని తమిళనాడు ప్రభుత్వం తెలుగు కూడా తమిళనాడు పాఠశాల నందు బోధనలో విద్యార్థులకు ఇష్టం వచ్చిన భాష తీసుకోవచ్చని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని కావున తమిళనాడు ప్రభుత్వాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తెలుగు తమిళ ప్రజల వారి యొక్క జీవన శైలి కట్టుబాట్లు సంప్రదాయాలు ఒకటిగా ఉంటాయన్నారు అన్నదమ్ములవలె కలిసిమెలిసి ఉంటారు కాబట్టి కర్ణాటక కేరళ తెలంగాణ మహారాష్ట్రమి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తో కలిపి రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి కోసం ప్రత్యేక దక్షిణాదికి రాజధానిని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు.
తమిళనాడులో తెలుగు ప్రజాసంఘాల కృషి ఫలించింది Reviewed by CHANDRA BABU on December 09, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 09, (రవికిరణాలు) : తమిళనాడులో తెలుగు ప్రజాసంఘాల కృషి ఫలించిందని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయల...

No comments: