సరస్వతి శిశు మందిర్ లో హోమియో మందులు పంపిణీ
గూడూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు పోతన అన్నారు.గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం లో కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన పేరిట ఏర్పాటయిన ఎం.వి. రావు పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ సౌజన్యంతో విద్యార్థులకు విషజ్వరాలు హోమియో మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.తాను విద్యనభ్యసించే సమయంలో వెంకటేశ్వరరావు తనకు విద్యాప్రదాత అని ఆయన మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేసి నిరంతరం నిరుపేద ప్రజలకు వారి శక్తి మేర సేవలు అందిస్తున్నారని పోతన అన్నారు .తమ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు జ్వరాలు సోకు తున్నాయని నిర్వాహకుల దృష్టికి తీసుకురాగా బుధవారం ఆ సంస్థ చైర్మన్ ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులను మూడు రోజులకు అందించారని తెలిపారు.అనంతరం సంస్థ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ, ఆచార్యులు, మాతాజీలు ,సమక్షంలో విద్యార్థులకు విష జ్వరాలు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులు పంపిణీ చేశారు.
గూడూరు, డిసెంబర్ 18, (రవికిరణాలు): ఆరోగ్యమే మహాభాగ్యం కావున ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని సరస్వతి శిశు మందిర్ ప్రధానాచార్యులు పోతన అన్నారు.గూడూరు పట్టణంలోని సరస్వతి శిశు మందిరం లో కోట మండలం విద్యానగర్ గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం ఆయన పేరిట ఏర్పాటయిన ఎం.వి. రావు పౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ సౌజన్యంతో విద్యార్థులకు విషజ్వరాలు హోమియో మందులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.తాను విద్యనభ్యసించే సమయంలో వెంకటేశ్వరరావు తనకు విద్యాప్రదాత అని ఆయన మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వెంకటేశ్వరరావు పేరిట ఒక సంస్థ ఏర్పాటు చేసి నిరంతరం నిరుపేద ప్రజలకు వారి శక్తి మేర సేవలు అందిస్తున్నారని పోతన అన్నారు .తమ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు జ్వరాలు సోకు తున్నాయని నిర్వాహకుల దృష్టికి తీసుకురాగా బుధవారం ఆ సంస్థ చైర్మన్ ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులను మూడు రోజులకు అందించారని తెలిపారు.అనంతరం సంస్థ చైర్మన్ లీలా మోహన్ కృష్ణ, ఆచార్యులు, మాతాజీలు ,సమక్షంలో విద్యార్థులకు విష జ్వరాలు సోకకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా హోమియో మందులు పంపిణీ చేశారు.
No comments: