రవికిరణాలు(తిరుమల) : తిరుమల శ్రీవారిని సీబీఐ జాయింట్ సెక్రటరి జేడీ లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారిని దర్శించుకోవడం పట్ల లక్మీనారాయణ ఆనందం వ్యక్తం చేశారు. యువతకి ప్రేరణ ఇచ్చే ఉద్దేశంతో ఎస్వీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యానని, అందుకే స్వామివారి దర్శనానికి తిరుమల వచ్చానన్నారు. తీవ్ర ఒత్తిడిలో ఉండడం వల్లే యువత డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారని.. వాటిని అధిగమించాలంటే ప్రణాళికా బద్దంగా పనులు చేసి, ఆధ్యాత్మిక భావంతో ముందుకెళ్ళితే డిప్రషన్ నుండి బయటపడవచ్చుని అభిప్రాయపడ్డారు. తల్లి తండ్రులు పిల్లలకోసం సమయం కేటాయించి..మంచి విషయాలతో పాటు మంచి వ్యక్తుల గురించి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి పౌరుడు ఒక లక్ష్యసాధనతో ముందుకు సాగాలని, అలాగే టీవీ ఛానల్స్లో పిల్లల్లో నైపుణ్యం కలిగేలాంటి కార్యక్రమాలు చేయాలని మీడియాకు తెలిపారు.
ఒత్తిడి వల్లే డ్రగ్స్..ఆధ్యాత్మిక భావమే పరిష్కారం
ఒత్తిడి వల్లే డ్రగ్స్..ఆధ్యాత్మిక భావమే పరిష్కారం
Reviewed by CHANDRA BABU
on
July 22, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల) : తిరుమల శ్రీవారిని సీబీఐ జాయింట్ సెక్రటరి జేడీ లక్ష్మీనారాయణ దంపతులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వా...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: