రవికిరణాలు(కృష్ణా జిల్లా): రైతులు బాగుండాలి..పంటలు బాగా పండాలి..రాష్ట్రం పచ్చగా ఉండాలి...జలసిరితో కనులపండుగ కావాలి అని కోరుకుంటూ మంత్రి కామినేని శ్రీనివాస్ పూజలు చేశారు. పట్టిసీమ ద్వారా వచ్చిన గోదావరి జలాలు కైకలూరు నియోజకవర్గంలో ప్రవేశించిన సందర్భంగా సోమవారం కైకలూరు మండలం విజరం లాకులు పోల్ రాజ్ కెనాల్ వద్ద గోదావరి జలాలకు మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళం ప్రత్యేక పూజలు చేశారు. గత పదేళ్ల కాలంలో తొలిసారిగా జూలై నెల ప్రారంభానికే కృష్ణా డెల్టాకు సాగునీరిచ్చిన ఘనత చంద్రబాబునాయుడుకి దక్కుతుందన్నారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న సంకల్పం ఉన్న ముఖ్యమంత్రి అపర భగీరధుడని మంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు.
రాష్ట్రం కోసం కామినేని పూజలు
Reviewed by CHANDRA BABU
on
July 03, 2017
Rating: 5
రవికిరణాలు(కృష్ణా జిల్లా): రైతులు బాగుండాలి..పంటలు బాగా పండాలి..రాష్ట్రం పచ్చగా ఉండాలి...జలసిరితో కనులపండుగ కావాలి అని కోరుకుంటూ మంత్రి కామి...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: