రవికిరణాలు(నెల్లూరు) : దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందవద్దని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పాత మున్సిపల్ ఆఫీసు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మేయర్ పరిశీలించారు. వెంకటేశ్వరపుర ప్రాంతంలో బాలిక చనిపోయినట్లు ప్రచారం జరిగిందని కానీ ఆ వ్యాధి నిర్థరణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. దోమల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి డివిజన్లో అవసరమైన పనులు చేపడతమాన్నారు. దోమల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. పాత మున్సిపల్ ఆఫీసు వద్ద నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్పై మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగే విధంగా నిర్మాణం చేపట్టవద్దంటూ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
దోమలు నివారిస్తాం..
దోమలు నివారిస్తాం..
Reviewed by CHANDRA BABU
on
July 22, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందవద్దని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పాత మున్సిపల్ ఆఫీసు...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: