రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు జిల్లా నాయుడుపేట రాజగోపాలపురం 3వ వీధి ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు జనసేన నడుం బిగించింది. వర్షం వల్ల వీధిలో మురుగు నీరు నిల్వ ఉండిపోయి తాగునీరు సైతం కలుషితమైపోయింది. ఈ పరిస్థితి తెలుసుకున్న జనసేన సేవా దళ్... నీటి ట్యాకర్లతో రాజగోపాలపురం 3వ వీధి ప్రజల వద్దకు వెళ్లింది. ఈ కార్యక్రమంలో జనసేన సేవా దళ్ నాయుడుపేట సభ్యులు యాసిన్ షేక్, గిండి సతీష్ కుమార్, లీలామోహన్, యష్వంత్ పాల్గొని ప్రజలకు నీరందించారు.
[gallery td_select_gallery_slide="slide" ids="747,746,745,744"]
No comments: