జీఎస్‌టిని ఎత్తివేయాలని ప్రజారోగ్య డిమాండ్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

జీఎస్‌టిని ఎత్తివేయాలని ప్రజారోగ్య డిమాండ్

రవికిరణాలు (నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరులో మందులు, వైద్య పరికరాలు, బల్క్‌ డ్రగ్స్‌, పరీక్షలకు వాడే వస్తువులపై విధించిన వస్తు సేవల పన్ను జీఎస్‌టిని ఎత్తివేయాలని ప్రజారోగ్య వేదిక డిమాండ్‌ చేసింది. మందులపై ఇప్పటివరకు ఉన్న 5శాతం పన్నును 12శాతానికి పెంచడం దారుణమని ప్రజారోగ్య వేదిక నాయకులు మండిపడ్డారు. వైద్య పరికరాలు, వైద్య పరీక్షలకు ఉపయోగించే వస్తువులు, ముడిసరుకులపై పన్ను పెంచడం వల్ల వైద్యం పేదలకు అందని ద్రాక్షాగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన జీఎస్టీ ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి కాబట్టి వెంటనే ఆ పన్నును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
జీఎస్‌టిని ఎత్తివేయాలని ప్రజారోగ్య డిమాండ్ Reviewed by CHANDRA BABU on July 04, 2017 Rating: 5 రవికిరణాలు (నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరులో మందులు, వైద్య పరికరాలు, బల్క్‌ డ్రగ్స్‌, పరీక్షలకు వాడే వస్తువులపై విధించిన వస్తు సేవల పన...

No comments: