రవికిరణాలు(తిరుమల) : తిరుమలలోని అన్నమయ్యభవనంలో మంగళవారం అధికారులతో జేఈవో సమావేశం నిర్వహించారు. కాలినడకన తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు నడకమార్గాలలో టోకెన్లు మంజూరు చేసి, స్లాట్ విధానం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తుండడంపై కాలినడక భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కెఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. అనంతరం జేఈవో మీడియాతో మాట్లాడుతూ సోమవారం రోజు 19,663 మంది కాలినడక భక్తులు దివ్యదర్శనం స్లాట్ విధానం ద్వారా రెండున్నర గంటల్లోపు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మూత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, పెరటాశి నెల ఇతర రద్దీ రోజులలో మినహా అన్ని రోజులలో (శుక్ర, శని, ఆదివారాలతో కలుపుకుని) కాలినడక భక్తులకు టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టోకెన్లు కలుపుకుని రోజుకు 20 వేల టోకెన్లను జారీ చేస్తున్నామని చెప్పారు.
హర్షం చేసిన భక్తులు
Reviewed by CHANDRA BABU
on
July 18, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల) : తిరుమలలోని అన్నమయ్యభవనంలో మంగళవారం అధికారులతో జేఈవో సమావేశం నిర్వహించారు. కాలినడకన తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు నడకమ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: