రవికిరణాలు (తిరుమల) : తిరుమల అలిపిరి చెకింగ్ పాయింట్ను సీవీఎస్వో ఏకే.రవికృష్ణ పరిశీలించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద టిటిడి విజిలెన్స్, ఎస్పిఎఫ్ సిబ్బంది మంగళవారం విస్తృత తనిఖీలు నిర్వహించి 6 మద్యం సీసాలు, గుట్కా ప్యాకెట్లు, ఆరుగురు లడ్డూ దళారులను గుర్తించారు. నిందితులను గుర్తించిన సిబ్బందిని టిటిడి సివిఎస్వో ఏకే.రవికృష్ణ అభినందించారు. ప్రతిఒక్కరు ఇలాగే పనిచేయాలని పలుసూచనలు చేశారు. ద్విచక్రవాహదారులను పలకరించి హెల్మెట్స్ ధరించాలని విజ్ణప్తి చేశారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1542,1541,1540"]
[gallery td_select_gallery_slide="slide" ids="1542,1541,1540"]
No comments: