రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు నగరం సిరి మల్టీఫ్లెక్స్ నందు నూతనంగా వాటర్ బోర్ ఏర్పాటు చేశారు. 46వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వేలూరు మహేష్ ,కార్పొరేటర్ వేలూరు సుధారాణి ఈ పనులను అభివృద్ధి చేయించారు. ప్రజలకు నీళ్ళను అందించాలని ఉద్దేశ్యంతో ఈ పనులను చేపట్టారు. అదేవిధంగా ట్రంకు రోడ్డు సమీపంలోని కోమల విలాస్ సెంటర్లో డ్రైనేజ్ వాటర్ను, చెత్తాచెదారాన్ని పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు.నిత్యం 46వ డివిజన్ లో ప్రజల్లో మమేకమై సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశలో కార్పొరేటర్ తన భర్తతో కలిసి సమస్యలు పరిష్కరించడం విశేషం. సమస్యలను ఎప్పటికప్పుడు అధికారుల దృష్టిలో పెట్టి డివిజన్ సమస్యలను తీరుస్తున్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1537,1536,1535,1534,1533,1532,1531"]
[gallery td_select_gallery_slide="slide" ids="1537,1536,1535,1534,1533,1532,1531"]
No comments: