ఢిల్లీ శ్రీవారి చెంత సీవిఎస్‌వో - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఢిల్లీ శ్రీవారి చెంత సీవిఎస్‌వో

రవికరణాలు(న్యూఢిల్లీ) : ఢిల్లీలోని శ్రీవారి ఆలయాన్ని టిటిడి సివిఎస్‌వో రవికృష్ణ సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ భద్రతా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆలయం వద్ద గల భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సివిఎస్‌వో సూచించారు. ప్రముఖులు ఆలయాన్ని సందర్శించినపుడు భద్రతాపరంగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేస్తామని తెలిపారు.అంతకుముందు న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ పోలీస్‌ మిషన్‌ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ సదస్సులో సివిఎస్‌వో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 40 మంది ఐపిఎస్‌ అధికారులు ఈ సదస్సుకు విచ్చేశారు.

ఢిల్లీ శ్రీవారి చెంత సీవిఎస్‌వో Reviewed by CHANDRA BABU on July 21, 2017 Rating: 5 రవికరణాలు(న్యూఢిల్లీ) : ఢిల్లీలోని శ్రీవారి ఆలయాన్ని టిటిడి సివిఎస్‌వో రవికృష్ణ సందర్శించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ భద్రతా స...

No comments: