రవికిరణాలు(వెంకటగిరి) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి అభ్యర్థి గా బీజేపీ పార్టీ ఎన్నుకోవడంతో వెంకటగిరి పట్టణం లోని స్థానిక కాశీపేట కూడలిలో బీజేపీ పార్టీ నాయకులు టపాసులు పేల్చి మిఠాయి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రముఖ న్యాయవాది కోటి మాట్లాడుతూ ముప్పవరపు వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేసి విద్యార్థి నాయకుడుగా పలు సమస్యల పైన పోరాడారని, ఎమర్జెన్సీ టైంలో జైలు జీవితం కూడా గడిపి ఇందిరా కాంగ్రెస్ కి ఎదురొడ్డి నిలిచారని అన్నారు. మొదటి నుంచి నేటివరకు బీజేపీ పార్టీలోనే ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు ఎన్నో చిరస్మరణీయ కార్యక్రమాలతో ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. అంతేకాకుండా మన వెంకటగిరి రాజాస్ కాలేజ్ లో చదివి ఇంత గొప్ప నాయకుడుగా ఎదగడం మన వెంకటగిరి ప్రజలకు కూడా గర్వకారణం అని తెలిపారు. దేశరాజకీయాల్లో తలపండిన నాయకుడిగా కీర్తి గడించిన మన నెల్లూరు జిల్లా వాసి వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి గా ఎన్నుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటి మణి, కృష్ణమూర్తి, గోపాలనాయుడు, బద్రి మల్లికార్జున్, బాలయ్య, ప్రసాద్, తదితరులు పాల్గొననున్నారు.
వేడుకల్లో కమలదళం
వేడుకల్లో కమలదళం
Reviewed by CHANDRA BABU
on
July 18, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి) : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుని ఉపరాష్ట్రపతి అభ్యర్థి గా బీజేపీ పార్టీ ఎన్నుకోవడంతో వెంకటగిరి పట్టణం లోని స్థానిక కాశీప...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: