కార్పొరేషన్‌ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: మాజీ కార్పొరేటర్‌ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

కార్పొరేషన్‌ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: మాజీ కార్పొరేటర్‌

రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : కార్పొరేషన్‌ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ కార్పొరేటర్‌ మేకల నరేంద్రరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేద ప్రజల క్రతువులకు వినియోగించే స్థలాన్ని కార్పొరేషన్‌ స్థలమంటూ కర్మ క్రతువులు చేసుకోకుండా అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలోని పాతవేదాయపాలెంలో శివాచారీ అనే వ్యక్తి కర్మ క్రతువుల కోసం సొంత నిధులతో రేకుల షెడ్డు నిర్మించారు. ఆ షెడ్డును కార్పొరేషన్‌ వారు బుధవారం తొలగించారు. పేద ప్రజల కోసం నిర్మించిన షెడ్డును అనాలోచితంగా కార్పొరేషన్‌ అధికారులు కూల్చివేశారంటూ మేకల నరేంద్ర దుయ్యబట్టారు. గురువారం స్వయంగా నెల్లూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఢిల్లీ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. రెసిడెన్షియల్‌ ప్రాంతంలో కర్మక్రతువులకు స్థలమేంటని ఎదురు ప్రశ్నించిన కమిషనర్‌... ఈ విషయంలో తానేమీ చేయలేనని చేతులెత్తారు. కమిషనర్‌ స్పందనతో ఆగ్రహించిన స్థానికులు శుక్రవారం కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
కార్పొరేషన్‌ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు: మాజీ కార్పొరేటర్‌ Reviewed by CHANDRA BABU on July 13, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : కార్పొరేషన్‌ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మాజీ కార్పొరేటర్‌ మేకల నరేంద్రరెడ్డి తీవ్ర స్థాయ...

No comments: