రవికిరణాలు(తిరుమల-సెల్వం): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జి.ఎస్.టి విధానాన్ని టిటిడి లోకూడా అమలు చేస్తామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈఓ కార్యక్రమం లో భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు ఈఓ సమాధానమిచ్చారు. అక్టోబర్ నెలకు సంబందించిన 56,295 శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను శుక్రవారం నుంచి ఆన్ లైన్ లో ఉంచామన్నారు. తిరుమలలో అద్దె గదుల కేటాయింపు లో నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 18,25 తేదీల్లో వయోవృద్ధులు, దివ్యాoగుల కోసం ఇస్తున్న శ్రీవారి దర్శన టోకెన్లను నాలుగు వేలకు పెంచామన్నారు. 19, 26 తేదీల్లో 5 సంవత్సరాల లోపు వయసున్న చిన్నపిల్లలను తల్లిదండ్రులతో పాటు సుపథం మార్గం లోశ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని వివరించారు.
తిరుమలలోనూ జీఎస్టీ...
తిరుమలలోనూ జీఎస్టీ...
Reviewed by CHANDRA BABU
on
July 07, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల-సెల్వం): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జి.ఎస్.టి విధానాన్ని టిటిడి లోకూడా అమలు చేస్తామని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సిం...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: