రవికిరణాలు(ముంబై) : రిలయన్స్ జియో ప్రకటనతో టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ మరో సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ముంబైలో రిలయన్స్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖేష్ అంబానీ స్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించారు. ఇది పూర్తిగా మేడిన్ ఇండియా ఫోన్ అని చెప్పారు. రిలయన్స్ జియో ఫోన్ 22 భారతీయ భాషలను కలిగి ఉంటుందని ముఖేష్ తెలిపారు. 2.4 అంగుళాల స్క్రీన్తో ఇది అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. వాయిస్ కమాండ్తో కూడా ఈ ఫోన్ పనిచేయనున్నట్లు వెల్లడించారు.ఈ ఫోన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. నెలకు రూ.153 చెల్లిస్తే అన్లిమిటెడ్ డేటా, ఇంకా వాయిస్ కాల్స్ పూర్తిగా ఉచితం. మిగిలిన డేటా ప్రొవైడర్లతో పోల్చుకుంటే వాళ్లు వసూలు చేస్తున్న చార్జీలో కేవలం 3శాతం చెల్లిస్తే చాలు. ఆగస్ట్ 15 నుంచి ఈ ఫోన్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ ఫోన్లను పూర్తి ఉచితంగా ఇవ్వనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అయితే రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిందిగా ఆయన సూచించారు. అయితే అది పూర్తిగా రిఫండబుల్ అని, మూడేళ్ల తర్వాత దాన్ని తిరిగి వినియోగదారుడికి చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఫీచర్ ఫోన్ యూజర్లకు ఇది నిజంగా డిజిటల్ ఫ్రీడమ్ అవుతుందని ముఖేష్ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు.
బంపర్ ఆఫర్
Reviewed by CHANDRA BABU
on
July 21, 2017
Rating: 5
రవికిరణాలు(ముంబై) : రిలయన్స్ జియో ప్రకటనతో టెలికాం రంగంలో పెను సంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ మరో సంచలన ప్రకటన చేశారు. ఇవాళ ముంబైలో రిలయన్స...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: